నిసబ్ధ చింతామణి నాట్యమాడువేళ, అడవి కూనలు ఆటలాడు వేళ
హిమగిరి నందుని హృధయం ద్రవించిన వేళ
అడవి మైనం మధురమైన గానముతో నిశబ్ధ చింతామణి బిత్తరపోయి చూచువేళ
అడవివిధ పక్షుల కిలవారాలు సంగీతముగా శ్రుతి పలికించు వేళ
జాజి తోటలోని జాబిలి జాముగా పరులిడిన వేళ
ఏకదిక్కున ఏకవ్రతుడు రుధిరవర్ణముతో జనియించు వేళ
హిమనీ నదాలు నాకు ఎదురెవ్వరంచు ఎచటికో ఏకరువు పెట్టువెళ
అడవి పుష్పాల వలన వింటి జామరులు మధుర సువాసనలు మోసుకెళ్ళెడి వేళ
ఈ ఉషొదయపు వేళ
అడవిలోన లేడికూనా ! మీనం వలచిన కనులదాన
నెమలి వంటి నదకదాన నడకలోనె నట్యమాడ
నీ నడక చూచి జాజి మల్లె నీ పాదములను శృశించ కోరె
పిల్లతెమ్మెర నీ వింటి ముంగురులను నింగిలోకి విహరింధమనుచు మిన్నగులవలె నాట్యమాడించు వేళ, అదేమిభాగ్యమో!
మనసుతో పలకించితో, హృధయంతో ఆలకించితో ఒకపర్యాయము
వెనుదిరిగి చూచితి అది మాయో ప్రకృతి విధియో
కలకంటి రెప్పవేయలేదే జర పాదములు జరపలేదే కర్ణబేరులకు తాకుచున్న కరకర ధ్వనులు వినికిడికి రాలేదె శిలనైతినో లేక నిర్జెష్టుడనైతినినో
రక్షక భటులు లాఘవముగా లాగి ఒక్కటిచ్చిన తెలియలేదె
కాని నా కనులు పండినవేమో లేక నా సుకృతమో!
సప్తస్వరాలు కలిపి పలికించిన ఆ మధుర మందహాస సవ్వడి
చిట్టి గువ్వలు పలికించే మువ్వడి
నా హృదయం ననువీడి నాకు దూరంగా పోవుచున్నది
ఆ ఘడియలోనే!
నాతనువు నన్ను మేలుకొలిపింది
కర్కశ భటులకు ద్విపక్షాలకు ఇచ్చే భత్యము చాలలేదేమో!
నూరు రూపాయలు జొడించుకొని పొమ్మంటిరి.
No comments:
Post a Comment